Tuesday, July 18, 2017

కర్పూరం గురించి.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
  1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
  2.  అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
  3.  పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
  4.  నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
  5.   కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
  6.   కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
  7.   కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
  8.   అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
  9.   కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
  10.   మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
  11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
  12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
  13.   దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
  14.   పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
  15.   తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
  16.   పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
  17.   కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
  18.   అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
  19.   కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
  20.   కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.

Saturday, May 13, 2017

LIFE IS NOT FAIR FOR ANYONE --A lesson between two characters of Mahabharat

Karna asks Krishna - "My mother left me the moment I was born. Is it my fault I was born an illegitimate child? I did not get education from Dronacharya because I was considered a non- Kshatriya. Parshu-Ram taught me but then gave me the curse to forget everything since I was a kshatriya. A cow was accidentally hit by my arrow & its owner cursed me for no fault of mine. I was disgraced in Draupadi's swayamvar. Even Kunti finally told me the truth only to save her other sons. Whatever I received was through Dhuryodhana's charity. So how am I wrong in taking his side?"

Krishna replies, "Karna, I was born in a jail. Death was waiting for me even before my birth. The night I was born I was separated from my birth parents.

From childhood you grew up hearing the noise of swords, chariots, horses, bows and arrows. I got only cow herd's shed, dung, and multiple attempts on my life even before I could walk!

No army, no education. I could hear people saying I am the reason for all their problems.

When all of you were being appreciated for your valour by your teachers I had not even received any education. I joined gurukula of Rishi Sandipani only at the age of 16!

I had to move my whole community from the banks of Yamuna to far off Sea shore to save them from Jarasandh. I was called a coward for running away.

If Dhuryodhana wins the war you will get lot of credit. What do I get if Dharmaraja wins the war? Only the blame for the war and all related problems.

Remember one thing Karna. Everybody has challenges in life. LIFE IS NOT FAIR ON ANYBODY. Dhuryodhan also has a lot of unfairness in life and so as Yudhishtar.

But what is Right (Dharma) is known to your Conscience. No matter how much unfairness we got, how many times we were disgraced, how many times we were denied what was due to us, what is important is how you REACTED at that time. Stop whining Karna. Life's unfairness does not give you license to walk the wrong path of अधर्म.

🙏🕉🙏🕉🙏

Monday, January 2, 2017

*క్రైస్తవ మతప్రచారకుని తో జగద్గురువుల సంభాషణ -1973*


*శ్రీ గురుభ్యో నమః*

శ్రీ శ్రీ శృంగేరీ శారదా పీఠము యొక్క 35వ జగద్గురువులైన *శ్రీ అభినవ విద్యాతీర్థుల* వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.
గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము, వారి మతము సర్వశ్రేష్ఠమయినది, కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందు కోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు, వారిమతపుగొప్పదనము యేమిటోతెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించిసంభాషించారు.
యోగక్షేమాలు, కుశల ప్రశ్నల తర్వాత జగద్గురువులు అడిగినారు,
*జగద్గురువులు:*" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి?"
*క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ]:* స్వామీ, నేను మీ ఊరిలో, మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను."
*గురువులు:* " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము?"
*క్రై. మ. ప్ర.:* "నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "
*గురువులు:*"మీరు ఉపదేశించునదియేమి?"
*క్రై. మ. ప్ర.:* "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ, జనులకు ఉపదేశము చేసి, వారందరినీ మా మతానికి మార్చుకోవా లనుకొంటున్నాను."
*గురువులు:*" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే, నేను కూడా తెలుసుకుంటాను గదా?"
*క్రై. మ. ప్ర.:*" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధాన ములనుఇవ్వగలవాడను
*గురువులు:* "మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది?"
*క్రై. మ. ప్ర.:*"మా మతము పుట్టి 1973 సంవత్సరా లయినాయి "
*గురువులు:*"సంతోషము,మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము, సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందుప్రజలు ఉన్నారా లేరా?మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా?"
*క్రై. మ. ప్ర.:*" జనులే లేకపోతే మేముమతబోధ ఎవరికి చేస్తాము? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందుకూడా ప్రజలు ఉండనే ఉన్నారు.
*గురువులు:* మీ మతము లోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజన మేమి?"
*క్రై. మ. ప్ర.:*"మా మతము లో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది"
*గురువులు:*" సరే, *మీరు మీమతమునుఅనుసరించే వారికి మాత్రము స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు.ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి, మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికివెళుతుండేవారా?"*
*క్రై. మ. ప్ర.:*" వారంతా నరకానికే వెళుతుండే వారు.మా మత ధర్మాన్ని పాలించనందువల్ల"
*గురువులు:*" ఇదెక్కడి న్యాయము? ఈ కాలపు ప్రభుత్వాలూ,న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా!!, *మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారునరకభాజనులవుతారుఅనేదిన్యాయమేనా?ముందెప్పుడో రచించ బోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుటఎక్కడైనా సాధ్యమా? కాబట్టి, మీరు మీ మతమునకు సంబం ధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా?*
*క్రై. మ. ప్ర:*[బిక్కచచ్చి], ఔను స్వాములూ, వారు అందరూ నరకానికి కాదు, స్వర్గానికే వెళ్ళి ఉండాలి"
*గురువులు:*" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే *మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా?ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల, వాటిని అనుసరించే కొందరుమాత్రమేస్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా? అందువల్ల, మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండి ఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా?"*
*క్రై. మ. ప్ర:*"[తన మాటల కు తానే చిక్కుకొని గాభరాపడి] స్వామీ!!, మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలనుఅడుగుతున్నారే? దయచేసి నన్ను వదిలేయండి" అన్నాడు.
*గురువులు:*"సరే, అట్లాగే కానివ్వండి, ఆ సంగతి వద్దు. చూడండి, ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ, సుఖ సంతోషా లకూ లోనగుటను చూస్తున్నాము కదా, దానికేమిటి కారణము?"
*క్రై. మ. ప్ర:*"దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు"
*గురువులు:*" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ, ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగాఇస్తున్నాడంటే, భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖము లోనూ,తనకుఅప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా?"
*క్రై. మ. ప్ర:*"అది భగవంతుని స్వంత ఇఛ్చ,స్వామీజీ,మనమేమీ చేయలేము. ఆయన ఏమికావాలన్నా చేయగలడు.అది ఆయన ఇష్టము."
*గురువులు:*"భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చుఅన్నట్టయితే, అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా? ఆ సుఖాన్నికొందరికిమాత్రమే ఎందుకు ఇచ్చాడు?దానికి కారణమేమయి ఉంటుంది?"
*క్రై. మ.ప్ర:*"[అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను?"
*గురువులు:* *మీవాదానికి ఒక యుక్తి గానీ, తర్కం గానీ ఉన్నట్టేకనిపించుట లేదు.*సరే,అదీ ఉండ నివ్వండి, మరొక విషయము!!, చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత.ఇలాగున్నపుడు, చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా?"
*క్రై. మ. ప్ర.:*"చిన్నపిల్లలు పాపముఎలాచేయగలరు?వారు ఒక తప్పును కూడా చేయలేరు.వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికి అవి అంటవు"
*గురువులు:*" అందుకే అడిగినాను,వారు వెళ్ళేది స్వర్గానికా,లేకనరకానికా?"
*క్రై. మ. ప్ర.:*"చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు"
*గురువులు:*" అట్లయితే మన తల్లిదండ్రులంతా మన గురించి చాలా పెద్ద తప్పే చేసారనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికివదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది? కాదా?"
*క్రై. మ. ప్ర.:*"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను"
*గురువులు:*" సరే, వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా?"
*క్రై. మ. ప్ర.:*భగవంతునికి ఎప్పుడునిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు, అప్పుడే పోతారు
*గురువులు:*ఇదేమయ్యా ఆశ్చర్యముభగవంతుడు పిచ్చివాడా యేమి!!, తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు?
*క్రై. మ. ప్ర.:*"అలాగ కాదు,అక్కడఅదంతటికీ ఒక క్రమ విధానము ఉంటుంది"
*గురువులు:*" సరే, మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించారో కొంచము చెపుతారా? [ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులేకొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో, దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి
*క్రై. మ. ప్ర.:*"కానివ్వండి స్వామీ, చెప్పండి"
*గురువులు:*"ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చనిపోయిన తరువాత, దేవుడు, ఏదో ఒకరోజు, న్యాయ నిర్ణయ మును చేసి, కొందరికి స్వర్గాన్నీ, కొందరికి నరకాన్నీ ఇస్తాడు.కదా!? సరియేనా?"
*క్రై. మ. ప్ర.:*"ఔనౌను, తమరు చెప్పింది సరిగ్గా ఉంది"
*గురువులు:*"ఈ ప్రపంచ ములోనే జరుగుతున్న సంగతిని చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే, విచారణకు మొదట, ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచు తారు. దాని తర్వాత కూడా అతడినిపోలీసులు లాకప్లోఉంచాలంటే, దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ, కారణమూ, అనుమతీ లేకుండా, విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయవలసి ఉంటుంది.ఇలాగున్నపుడు, ఒకడు మృతుడయిన తరువాత వాడికి, "ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చచ్చిపోయే వరకూ, అనగా, కోటి కోటి సంవత్సరాలయ్యేవరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి,అదంతా అయ్యే వరకూ, ’నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే,అది న్యాయమని అపించుకుంటుందా? మీరే చెప్పండి?"
జగద్గురువుల ఈమాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడుదిక్కుతోచని వాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ,
*మీకుమీ మతమేగొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతోఅనుసరించవలెను.అంతే కానీ, ఇతరులతో, ’మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుస రించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించక పోతే మీకు, నరకమూ, దుఃఖమే గతి* అని చెప్పుట సాధువైనది కాదు. *మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరు లకు వారి వారి తల్లులు పూజనీయులు.’మా తల్లి మాత్రమేపూజనీయురాలు,ఇతరుల తల్లులు కాదు* అంటూ మీరు చెప్పితే అది *మీ మూఢత్వమే* అవుతుంది. *నా తల్లి కూడా ఇతరుల తల్లుల వలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది.* అని ఉపదేశించినారు. ఆతడినివీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువు లు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించి నారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు.
ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,
*సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|*
*అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్||*
"మొదట యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి,’ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’యని అంటాడు. బ్రహ్మ దేవుడు, జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము, భగవంతుడు అనాది యైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ,మనధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము,సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి.ఫలము నిచ్చేది భగవంతుడే.
భగవంతుడు దయాళువు అనునది దిటమైనమాట.. *తప్పుచేసినవాడు తన తప్పునుప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడుక్షమిస్తాడా? భగవంతుడు కూడా అట్లే.*ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగాక్షమించడు. *మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి.ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి.* *మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను.*
శ్రీరామచంద్రుడు,శ్రీకృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములోమాత్రమే కనిపిస్తాయి.మనధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము, అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. *ఇంతటిమహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూజన్మించాము. ఈ సనాతనధర్మపు బోధనలను పాటించి మనమందరమూ శ్రేయస్సుకుతగినవారము కావలెను.* అని ఉపదేశించినారు.
{శ్రీ శృంగేరీ శారదాపీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన *శృం
గేరీ పుణ్యక్షేత్రము* పుస్తకము నుండీ అనువాదము}

Friday, November 11, 2016

కార్తీకమాసం-వివిధ దానాలు

కార్తీక మాసంలో ఏ దానముచేసిన అత్యంత పుణ్యఫలం. దానాల్లో దీప దానం, స్వయం పాకం, శాఖా దానం, ధన దానం, వస్త్ర దానం, సువర్ణ దానం ప్రధానమైనవి.
శాఖా దానం అంటే-- బ్రాహ్మణునికి కూరగాయలు దానం ఇవ్వాలి. ఉసిరి, తులసి కూడా దానమిచ్చి గ్రహీత అశ్విర్వాదని పొందాలి. దంపతులను పార్వతి పరమేశ్వరాలుగా భావించి బోజనాదులు (ఆతిధ్యం) ఇవ్వాలి. ఆ విధమైన శక్తి, వెసులుబాటు లేనివారు యజ్ఞోపవీతం, తాంబూలం, దక్షిణలిచ్చి 'శాఖా దానం' విధిని నిర్వర్థించమన్న సంతృప్తి పొందగలరు.
శయన దానం అంటే-- పరుపు, మంచం, దుప్పటి దానంగా ఇవ్వాలి. ఈ దాన ఫలితం స్వర్గప్రాప్తి
కన్య దానం పాలం కూడా ఉత్తమమైనది. అందుకనే మన తెలుగువారు పెళ్లిళ్లు అధికంగా కార్తీక మాసంలోనే జరుగుతాయి.
గోదానం, అన్నదానం పుణ్యప్రదమైనది.

జన్మలు మూడు రకాలు.


1) దేవ జన్మ
2) మానవ జన్మ
౩) జంతు జన్మ.
అన్ని జన్మలలో మానవ జన్మ చాల దుర్లభమైనది మరియు మహోన్నతమైనది అదేలాగు చాల ఉత్తమోత్తమమైనది.
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారము లేదు. అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు.తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని (మనవలోకాన్ని) చేరుకోవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులు ఉంటాయి కాని స్థూల శరీరం వుండదు. కనుక భగవత్సాక్షారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.
ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కన్పించిన, ఆ కర్మలన్ని బుద్దిపరంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే పరతంత్రంగా చేస్తాయి.కారణం ఈ జంతు జన్మలలో శరీరం మరియు మనస్సు వున్నాయి కాని బుద్ది మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడ కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భాగవత్సాక్షారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.
ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు , బాధలు, అవమానాలు అనుభవిస్తాడు.అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవ జన్మలోనే వున్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ది అనే సాదనం వున్న జన్మ ఇది. అదే విధంగా పరమాత్మ నందుకోవదడానికి తగిన కర్మలు చేసే అధికారం , జ్ఞానాన్ని పొందే అవకాశం వున్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానజన్మను “జంతూనాం నారా జన్మ దుర్లభం” అని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి.
సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ? : ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తాత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).ఏమిటా ఆ నిత్య వస్తువు? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు? ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం). “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకొనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే, జన్మను సార్థకం చేసుకోవటమంటే. ఆ శాశ్వతనందాన్నే మోక్షం, ముక్తి అన్నారు. అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి). బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ). ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే. వాటిని అన్నిటిని వదిలించుకోవాలంటే భగవంతార్పణ బుద్దితో కర్మలను చెయ్యాలి ఆచరించాలి

ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.!!


1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన“హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ?
3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లిమేతరుడిని ప్రధానిగా , కాని అధ్యక్షుడిగా కాని కల్గి ఉందా ?
4) తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ముల్లా కాని మౌల్వి కాని “ ఫత్ఫా “ ను జారి చేసారా ?
5) హిందువులు మేజారిటిగా గా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ,పాండిచేరి మొదలైన రాష్ట్రాలలో అనేక పర్యాయాలు ముస్లిం మతస్తుడు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు, ముస్లింలు మేజారిటిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో కాని,క్రైస్తవులు మేజరిటిగా ఉన్న నాగాలాండ్,మిజోరం లాంటి రాష్ట్రాలలో ఒక హిందువును ముఖ్యమంత్రి గా ఉహించుకోగలమా ?
6) దేశం లో ఉన్న 85% హిందువులు సెక్యులర్ కాక పొతే , మస్జిద్ లు, మదర్సా లు ఎలా మనగల్గుతున్నాయి ?, ముస్లింలు రోడ్లపై “నమాజ్” ఎలా చేయగల్గుతున్నారు ?, రోజుకు ఐదు సార్లు “అల్లాహ” తప్ప మరెవరు దేవుడు కాదని లౌడ్ స్పీకర్లు పెట్టి మరి ఎలా చెప్పగల్గుతున్నారు ?
7) ముస్లింల కోరిక మేరకు భారత్ లోని 30% భూభాగాన్ని హిందువులు వాడులుకున్నప్పుడు , అయోధ్య , మధుర, కాశీ లాంటి పుణ్య స్థలాల కోసం వారిని అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకేందుకు ?
8) హిందూ దేవాలయాల ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుపెడ్తున్న ప్రభుత్వం , వారి ప్రార్థన స్థలాల ఆదాయాన్ని ముట్టె సాహసం చేయగలదా ?
9) భారత స్వసంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబందం లేని ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ ఎందుకు మద్దతిచ్చారు ?
10) క్రైస్తవ, ముస్లిం పాఠశాలలో బైబిల్,ఖురాన్ బోదనలు నేరం కానప్పుడు భగవత్గీత బోదన తప్పేలా అవుతుంది ?
11) “హజ్ యాత్రకు సబ్సిడి ఇస్తున్న ప్రభుత్వం అమరనాథ్ , మాసన సరోవరంయాత్రలకు రెట్టింపు పన్నులు విదిస్తుంది , ఇదెక్కడి న్యాయం ?
12) కేరళ లో MLA,MP,మంత్రులు అల్లాహ , క్రీస్తు పేరుతొ ప్రమాణ స్వీకారం రాజ్యంగా విరుద్దం అయిన చేస్తున్నారు ఎందుకు ?
13) అస్సాం లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థిర సివాసం ఏర్పాటు చేసుకోవడానికిIMTD చట్టం ఉతమిచ్చింది , కాని భారతియులైనప్పటికి జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు ! ఎందుకి ద్వంద నీతి ?
14) భారత దేశం లోని అన్ని రాస్త్రాలాగానే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం అలాంటప్పుడు ప్రత్యెక స్వయం ప్రతిపత్తి ఎందుకు ?
15) పాఠశాల విద్యార్థులకు సైతం యునిఫం ఉండే మన దేశం లో దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు సాద్యం కావడం లేదు ?
16) దీపావళి లాంటి పండుగులను వైట్ హౌస్ , బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా జరుపుకుంటున్నాయి , అలాంటప్పుడు మన పార్లమెంట్ లో ఎందుకు జరుపుకోకూడదు ?
17) ఇస్లాం శాంతి కామక మతం అయితే , ఖురాన్ ను చదివి ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ?
18) “ ఈశ్వర్ అల్లాహ తేరే నామ్ “ – దిన్ని ఒప్పుకునే ఒక ముస్లిం మౌల్విని చూపండి ?
19) దేశ జనాభాలో 10% కంటే తక్కువగా ఉన్నవారినే మైనరిటిలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది , అలాంటప్పుడు 15% కంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనరిటిలుగా ఎలా పరిగణించబడతారు ?
20) హిందు ఆధిక్య ప్రాంతం లో ఉన్న ముస్లిం కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటున్నాయి, ముస్లిం ఆధిక్య ప్రాంతం లో హిందూ కుటుంబం శాంతిగా జివించగలదా ?
21) హిందూ మెజారిటి ఉన్న రాష్ట్రలు ప్రశాంతంగానే ఉంటున్నాయి , కాని జమ్మూ, నాగాలాండ్, మిజోరం ఎందుకలా లేవు ?
22) జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పాకిస్తానీ జమ్మూ పౌరునిగా మారుతున్నాడు, కాని జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భారతీయుడు జమ్మూ నివాసిగా మారడానికి అనర్హుడు ఇదెక్కడి న్యాయం ?
23) క్రైస్తావురాలిని పెళ్ళి చేసుకున్న J&K మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్ల, హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కుమారుడి వివాహాన్ని అంగీకరించి , హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కూతురి వివాహాన్ని అంగీకరించలేదు కారణం ?( ఇదే సేక్యులరిసం )
24) దురక్రమదారుడైన బాబర్ పేరుతొ అయోధ్యలో మస్జిద్ నిర్మాణం మీకు అంగీకారమ ?
25) హిందూ ఆధిక్యత గల ప్రాంతాల నుండి మొహర్రం యాత్ర సాఫీగా సాగుతుంది , ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం నుండి వినాయక యాత్ర సాఫీగా సాగుతుందా ?

ఒక్క సారి ఆలోచించండి నా హిందూ సోదరులు …
జైశ్రీరాం ………..
భారత్ మాతా కీ జై ……

పెరియపురాణం

మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుదివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.
ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము యిచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును యివ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఇది మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదుమాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అని అంటాడు. . కామక్రోదాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.
ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.
‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.
నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.
నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.
నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోటి. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.
వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి
యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.