Thursday, February 13, 2014

మన్మోహన్ ని చూసి చెప్పవచ్చు

రాష్ట్ర విభజన లాంటి కీలక సమస్య గురించి జాతిని గురించి అడ్రస్ చెయ్యలేని ఈ ప్రధాన మంత్రి కూడా ఒక ప్రధాన మంత్రే, అసమర్ధ నాయక గణం కీలక పదవులని అలంకరిస్తే ఎటువంటి అనర్ధాలో మన్మోహన్ ని చూసి చెప్పవచ్చు, రాష్ట్ర విభజన అనేది కోట్లాది మంది ప్రజల జీవితాలని మార్చే నిర్ణయం, ఇంతటి కీలక నిర్ణయాన్ని హడావుడిగా సీమాంధ్రుల మనోభావాలకి వ్యతిరేఖంగా తీసుకోవడం అన్యాయం, కనీసం సీమాంధ్రు లని మానసికంగా సిద్ధ పడనివ్వండి, దానికి కావాల్సింది టైం, 2009 ఎన్నికలలో తెరాస ఓడిపోయింది, ఓడిపోయిన వాదానికి రాష్ట్రం ఇవ్వడం అన్యాయం, కనీసం ఎన్నికలు అయిపోయిన తరువాత 2015 లో విభజించండి, అదే ప్రజాస్వామ్యం అంటే.

- ఫ్లిఫ్ సైడ్ ఇంకో విషయం ఏమిటంటే పదేళ్ళు పాలించిన పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తాముకాబట్టి వోట్లు వేయండి అని ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రతి పక్షం కూడా అభివృద్ధి ఎజెండా కాకుండా విభజన ఎజెండా మీద ఎన్నికలకి వెళ్ళడం మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి నిదర్శనం, ఇలా అయితే దేశం ఎలా ముందుకు వెళ్తుంది చెప్పండి, ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందుకు వెళ్ళాయి, మనం మాత్రం ఇలాంటి భావోద్వేగాలతో కొట్టుకుంటూ దేశాన్ని సక్సెస్ఫుల్ గా సంకనాకించేసాము.

No comments:

Post a Comment