Friday, November 11, 2016

ఓం విగ్నేశ్వరాయాణనమః

ఓం.నమో నమో వేంకటేశాయా


హథీరాంబావాజీ . కథ

క్రీస్తుపూర్వము ''650'' సంవత్సరముల క్రితము ఉత్తర బారతదేశము నుండి బావాజీ అను రామ భక్తుడు తిరుమలకు వచ్చినారు, తిరుమలలో ''40'' సంవత్సరాలు కఠోర తపస్సు చేసుకొంటూ తమ తపశ్శక్తితో ఒక వృక్షము యొక్క ఆకులను తీయగా మార్చుకొని ఆ ఆకులనే (కందమూలములు) ఆహారముగా భుజిస్తూ తపస్సు చేసుకుంటున్నారు బావాజి, 


బావాజీ తపస్సుకు మెచ్చిన శ్రీనివాసుడు బావాజీతో స్నేహము ఏర్పరుచు కొని ప్రతిరోజూ కొంత సమయము బావాజీతో గడిపేవారు, అలా కొంత కాలము గడిచిన పిమ్మట సరదా కోసము బావాజీతో శ్రీవేంకటేశ్వరస్వామి పాచికలు ఆడేవారు ఎప్పుడూ బావాజనే గెలిచేవారు శ్రీవేంకటేశ్వరస్వామి ఓడి పోతూ వుండేవారు ఒకరోజు బావాజీ ,
శ్రీనివాసుడుని అడిగేను. స్వామీ మీరు ప్రతీ సారీ ఓడి పోతున్నారు ఒకసారి ఐనా గెలవండి చూద్దాము అనెను,
అందుకు స్వామివారు బావాజీ నేను గెలవాలి అంటే ఏదైనా పందేముగా పెట్టవలెను, అప్పుడు నేను ఓడిపోతే నీకు ఒక అమూల్య మైన బహుమతి ఇస్తాను మీరు ఓడిపోతే ఏమి ఇస్తారు అని అడిగేను. అందుకు బావాజీ అన్నారు, హే! నారాయణా నాదగ్గరయేమి ఉంటుంది ,శరీరము మీద ఈ గోచీతప్ప మీరు అడుగు చున్నారు కనుక ఓక వేళ నేను ఓడిపోతే నాప్రాణమును మీకు అర్పిస్తాను, అని బావాజీ తన ప్రాణనమును పందేముగా పెట్టి ఆడుచుండెను,
విజయము స్వామీ వైపే కనబడుచున్నది, బావాజీ. అనుకున్నారు నా రాముడు ఐన ఈ శ్రీకృష్ణుడు శ్రీనివాసుడే నాప్రాణములు అడగగా నేను ఇవ్వక పోవుటయా ఇంత కన్నా భాగ్యమా నాకు మరో అవకాశము రాదు ఇన్నాళ్లకు నారాముడు నాకు ముక్తిని ప్రసాధించనున్నారు.అనుకొనేను బావాజీ,
తాను ఒకటి తలచితే ఆభగవంతుడు ఒకటి తలిచెను
శ్రీనివాసుడు అయిన శ్రీమన్నారాయునుడు తలిచెను నేను
విజయము పొందినచో నాభక్తుడు ప్రాణ త్యాగముచ్చేయును
నేను కాపాడవలసిన నాభక్తుడను నేనే ప్రాణములు అడుగుట భావ్యముకాదు అనుకోని శ్రీవేంకటేశ్వరస్వామి. ఓడి పోతారు, ఓడిన పిమ్మట పందెము ప్రకారము స్వామీ
మెడలోని. చంద్రహారము తీసి బావాజీమెడలో వేసెను .
స్వామీ నాకు ఎందుకు ఈ బంగారు వజ్ర వైడూర్యములు.
కానుకలు సన్యాసి అయిన నాకు వీటితో పని యేమి ఉంటుంది మీరే తీసుకెళ్ళండి స్వామీ .నాకు వద్దు అని పలికెను బావాజీ, పందెములో మాట ఇచ్చాను మీరే ఉంచుకొండి అని చెప్పి స్వామీ వెళ్ళిపోయేను ,
మూలవిరాట్టు మెడలో చంద్రహారము కనిపించలేదు అని గుడిలోని పూజారులు రాజుగారికి పిర్యాదు చేసినారు, రాజుగారు భటులను పిలిచి శ్రీవేంకటేశ్వరస్వామి. మెడలో చంద్రహారము చోరీ ఐనది తక్షణమే వెల్లివెతకండి దొంగ దొరికితే కొట్టి బంధించి తీసుకరండి అని ఆదేశించెను రాజు,
భటులు వెతుకుచుండగా బావాజీ మెడలో చంద్రహారమును కనిపించెను. బావాజీని భటులు బాగాకొట్టి బంధించి రాజు ముందు నిలబెట్టెను,
బావాజీ మెడలో హారమును చూసిన రాజు, ఓరీ పాపాత్ముడా, సన్యాసివి, రామ భక్తుడివి, మేము మిమ్మలను గౌరవించితిమి, నీవు చోరుడవు అని ఇప్పుడే తెలిసినది. స్వామీ భక్తుడని చెప్పుకొంటూ స్వామి హారమునే దొంగ తనము చేసినాడు ఈ పాపి ఇతనిని కఠినముగా శిక్షించండి అని భటులకి ఆదేశపరిచెను రాజు,
ప్రభూ! నేను దొంగను కాను ఈ హారమును నేను దొంగ తనము చేయలేదు నాతో స్వామివారు పాచికలు ఆడి ఓడిపోయారు ఆస్వామియే బహుమానముగా. ఈ హారమును నా మెడలో వేసారు. నాకు వద్దు వద్దు అని చెప్పినా, నామెడలో వేసి వెళ్ళిపోయారు. ఈవేళ నన్ను ఇచట దొంగగా నిలబెట్టాడు నాస్వామి. అని రాజుకి బావాజీ విన్నవించు కొనెను.
ఏమిటి ఆశ్రీనివాసుడే వచ్చి మీతో పాచికలు ఆడారా ? మీరు గెలిచారా ? ఆస్వామియే చంద్రహారమును నీ మెడలో వేసారా?
మాకు కథలు చెప్పుచున్నావా సన్యాసి ...
కథ కాదు ప్రభూ నేను చెప్పేది నిజము నారాముడు మీద ప్రమాణము, నాకు ఆశ్రీనివాసుడే ఈ హారమును నామెడలో వేసారు తమరు నన్ను నమ్మక పోతే ఇక ఏశిక్షయినా విధించండి.ప్రభూ..
ఓయీ సన్యాసీ నీవు చోరీ చేసినది శ్రీవేంకటేశ్వరస్వామి చంద్రహారమును. చోరీచేసి ఆస్వామియే ఇచ్చారు అని అబద్ధమాడుచున్నావు.. లేదు ప్రభు నేను అపద్ధము పలక లేదు సత్యమే పలుకుచున్నాను...సన్యాసి నీవు చెప్పేది నిజమే అయితే ఆస్వామి మీద నీకు అంత భక్తి ఉంటే మేము నీకు ఒక పరీక్ష పెడుతాము ఆపరీక్షలో నెగ్గి బయటకి రా, భటులారా బావాజీని చేరశాలలో భంధించి ఆగదినిండా చెఱకు గడలతో నింపండి, ఉదయానికెల్లా ఆచెఱుకు అంతయునూ. తిని బయటకు రా సన్యాసి నీవు ఎంత నిజాయతీ గలవాడివో ఉదయాన్నే చూస్తాను అని రాజు వెళ్ళి పోయేను,
రాజు ఆజ్ఞప్రకారము గది నిండా చెఱకు గడలతో నింపి బావాజీని ఆగదిలో బంధించి ఓ సన్యాసి నిను రక్షించ మని
ఆదేవునే వేడుకొ అని వెటకారంగా చెప్పి వెళ్ళిపోయారు భటులు,
బావాజీ బాధ పడుచూ హే రామా వద్దు వద్దు అన్నా ఈ హారమును నామెడలో వేశావు అమూల్యమైన బహుమానము అంటే ఇలా కొట్టించడమా. చేరశాలలో బంధించడమా నన్ను అందరూ చోరుడు అంటున్నారు, ఏనాడు మిమ్మలను ఏమీ అడగలేదు స్వామీ ఈ వేళ అడుగు చున్నాను నన్ను కాపాడు ఈ చేరసాలనుండి విముక్తి కలిపించు నాకు నీవు తప్ప దిక్కెవరు నను కాపాడు స్వామీ అని వేడుకొనేను బావాజీ ,
బావాజీ బాధపడుచూ చేస్తున్న ప్రార్ధనను మన్నించిన శ్రీనివాసుడు. ఏనుగు. రూపమున వచ్చి బావాజీని బంధిచిన గది గోడలను పడదోసి బావాజీని చేరసాల నుంచి విముక్తి చేసి గదిలోని చెఱకు గడలను అంతయును తినివేసి మదమెక్కిన ఏనుగువలే ఘీంకరించెను ఆదృశ్యము చూసిన ప్రజలు బయముతో పరుగులు తీసేను ఏనుగు రూపమున వచ్చిన రాముడిని బావాజీ అనేక విధములుగా ప్రార్ధించి ఎవరికీ హాని తలపెట్టకు స్వామీ అని వేడుకొనేను
బావాజీ ప్రార్థనకు శాంత్తించి ఏనుగు వెళ్ళిపోయేను, ఈ దృశ్యమును భటులు ద్వారా విన్న రాజు పరుగు పరుగున వచ్చి బావాజీ కాళ్ళ మీదపడి క్షమించమని వేడుకొనేను దయా మయుడయిన బావాజీ రాజుని క్షమించెను
ఏనుగు రూపమున, రాముడు, బావాజీకి, దర్శినము ఇచ్చినాడు కనుక, అప్పటినుండి హథీ,రామ్,బావాజీ,(హథీరాంబావాజీ)అను నామము ప్రసిద్ధిచెందెను, హథీరాంబావాజీ, భక్తికి చిహ్నముగా ఆరోజు నుండి నేటివరకు బావాజీ పేరుతో ఆలయములో నిత్యమూ వేకువజామున సుప్రభాతసేవాలో గోక్షీరనివేదనము, నవనీత హారతి సమర్పించే. ఆచారము నేటికీ కొనసాగుచున్నది, బావాజీతో. స్వామివారు పాచికలు ఆడిన పుణ్యస్థలమును మీరూ తిలకించవచ్చు, శ్రీవారి ఆలయమునకు ఆగ్నేయమున హథీరాంబావాజీ మఠము నందు ఈపుణ్యస్థలము కలదు చూసి తరించండి, బావాజీ తపశ్శక్తితో తీయగా చేసిన వృక్షము ఆకులు మీరూ తినవచ్చును (లభించు ప్రదేశము ) పాపవినాశనము కు వెళ్ళే మార్గమున వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన హథీరాం బావాజీ సమాధి ఉంటుంది ఈసమాది వద్ద మహంతులు (పూజారులు) బావాజీ తిని జీవించిన ఆకులను ప్రసాధముగా ఇస్తూ ఉంటారు,మీరూ తిని చూడండి తీయగా ఉంటుంది ,శ్రీవేంకటేశ్వరస్వామి తమభక్తులను ఆపదలో ఏదో ఒక రూపమున తప్పక వచ్చి. కాపాడుతారు అనడానికి నిదర్శన మే. ఈ బావాజీ కథ,
మనము తిరుమలలో దర్షించుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామి ప్రాణమున్న " సాలిగ్రామా శిలారూపము " ప్రాణముంది కనుకనే, అనంతాళ్వారులు కు సహాయము చేయడానికి వెళ్లి గడ్డము మీద. గుణపముతో కొట్టించుకొని వచ్చారు, తిరుమలనంబికి ఆకాశగంగను చూపించారు, బావాజీతో కూర్చొని పాచికలు ఆడారు అన్నమయ్య దగ్గర పాటలు పాడిించుకొన్నారు, తగొండ వేగమాంబతో పూల హారములు కట్టించుకొన్నారు శ్లోకాలు చదివించుకొన్నారు, ఇంతకన్నా నిదర్శనము ఏమికావాలి

No comments:

Post a Comment