Friday, November 11, 2016

కార్తీకమాసం-వివిధ దానాలు

కార్తీక మాసంలో ఏ దానముచేసిన అత్యంత పుణ్యఫలం. దానాల్లో దీప దానం, స్వయం పాకం, శాఖా దానం, ధన దానం, వస్త్ర దానం, సువర్ణ దానం ప్రధానమైనవి.
శాఖా దానం అంటే-- బ్రాహ్మణునికి కూరగాయలు దానం ఇవ్వాలి. ఉసిరి, తులసి కూడా దానమిచ్చి గ్రహీత అశ్విర్వాదని పొందాలి. దంపతులను పార్వతి పరమేశ్వరాలుగా భావించి బోజనాదులు (ఆతిధ్యం) ఇవ్వాలి. ఆ విధమైన శక్తి, వెసులుబాటు లేనివారు యజ్ఞోపవీతం, తాంబూలం, దక్షిణలిచ్చి 'శాఖా దానం' విధిని నిర్వర్థించమన్న సంతృప్తి పొందగలరు.
శయన దానం అంటే-- పరుపు, మంచం, దుప్పటి దానంగా ఇవ్వాలి. ఈ దాన ఫలితం స్వర్గప్రాప్తి
కన్య దానం పాలం కూడా ఉత్తమమైనది. అందుకనే మన తెలుగువారు పెళ్లిళ్లు అధికంగా కార్తీక మాసంలోనే జరుగుతాయి.
గోదానం, అన్నదానం పుణ్యప్రదమైనది.

No comments:

Post a Comment