Wednesday, February 12, 2014

కావ్వురి గారికి ఈ రోజు రాష్ట్రం తగలబడుతుంది అని గుర్తువచ్చింది

ఎవరికీ ఏప్పుడు జ్ఞానోదయం ఏ చెట్టు నీడ జరుగుతుందో
తెలియదు అంటే ఇదేనేమో .....మన కావ్వురి గారికి ఈ రోజు రాష్ట్రం తగలబడుతుంది అని గుర్తువచ్చింది .... ఎంత విచిత్రం ??

66 రోజుల ఉద్యమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలు అర్ధం కాలేదు ,రాజీనామా అడిగితే అటు తిరిగి చూడలేదు కారణం అయ్యనకు అప్పుడు జ్ఞానోదయం జరగలేదు తెలుసా సమైఖ్యవాదులారా...

ఎంత జ్ఞానోదయం కలిగిందంటే " ఈ ప్రాంతీయ వాదం దేశం విచ్చినం పునాది అంటా" మరి ఇదే కదా ఇన్ని రోజులు సమైఖ్యవాదులు చెప్పిన వినిపించుకోని సీమాంధ్ర కాబినెట్ మినిస్టర్ లు , ఎం.పి లు ఈ రోజు అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఢిల్లీ గల్లి లో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారు ....

ఇదే మాట సమైఖ్యవాదులు 'తెలంగాణా వద్దు' అని చెప్తే మేము దేశం నుండి విడిపోతున్నమా?? అని రివర్స్ ప్రశ్నలు సందించారు వేర్పాటువాదులు ...

ఇటువంటి సమాధానమే మనం దేశ ప్రధమ పౌరుడు అయిన రాష్ట్రపతి గారు సమైఖ్య వాదులకి గీతోపదేశం చెయ్య చూసారు ..

"రాష్ట్రపతి రాజ్యాంగం అనుగుణంగా నడవాలి కాని , ఒక ఫోన్ కాల్ తో అయిన ... ఏదో IAS ఎక్షమ్ లాగా నైట్ అవుట్ చేసి ...ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేరా... అన్నటుగా రాత్రికి రాత్రికి 69 పేజెస్ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్ పైన సంతకం చేసారు

సరే అయిన విచక్షణ వదిలేదం అనుకుంటే ... అంత క ముందు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో గౌరవనీయులైన ప్రణబ్ దాదా వచ్చినప్పుడు అయిన అంటారు .

" 1947 లోనే విభజన కోరేవారినే ఆపలేక పోయాము , ఈ 2014 లో ప్రజలని వారి కోరికలని ఎలా ఆప గలము???? అని దేశ ప్రజలకి ప్రశ్న వేసారు ...

కాని రాష్ట్రపతి గారు 1947 లో విభజన తో తెలంగాణా విభజన ని పోల్చి చూసి మనం ఆప లేము అనుకోని , BJP "ఒక vote రెండు రాష్ట్ర ల సిద్ధాంతం" చూసి అదే సరైన దారి భావించారేమో ???

కాని 1947 లో విభాజించినవారు మన వారు కాదు , విభజన కోరిన "జిన్నా" ప్రజల చేత ఎన్నుకోబడ్డ పరిపూర్ణ నాయకుడు కానే కాదు .... ఆ సమయం లో ప్రణబ్ దాదా మీకు "దేశ విభజన" మీకు గుర్తుకు వచ్చే బదులు మీకు ఆ టైం 'బెంగాల్ విభజన' చేసినప్పుడు "వందేమాతరం ఉద్యమం" ఎందుకు గుర్తుకు రాలేదు అని ఒక ప్రశ్న తోలచివేస్తుంది

కాని ఈ రోజు ఈ దేశం మీది, మీరే రాజు , మీ చేతిలో ప్రజలు ,ప్రజాస్వామ్యం అనే " మైనం ముద్దా" వుంది మీరు ఆ మైనం ముద్దని శిల్పం చేసిన , రాయిలాగా వదిలేసినా సర్వం మీదే బాధ్యత అని మర్చిపోయారా???

ప్రణబ్ దాదా మేరు కాంగ్రెస్ పార్టీ పెద్ద "troubleshooter " పేరు గాంచారు మరి 'దేశ సమగ్రత' విషయంలో ఎందుకు ఇలా తడబడ్దరో అర్ధం కావటం లేదు.

రేపు వచ్చే పరిణామాలలో ఎవరు వారి కోరిక కరెక్ట్ అనుకుంటూ పోతే దేశ సమగ్రతని మీరు ఎలా కాపాడబోతున్నారు దాదా ???

ఎందుకంటే ప్రాంతీయ వాదం అనేది ఒక ప్రాంత సమస్య కాదు అది "సామజిక అవ్యవస్థికరణ" వంటిది .
దానిని ఆపగలిగే మార్గం ఒకటే " జాతీయవాదం -పెంపొందించడం" అని మార్చిన నాడు ప్రజాస్వామ్యం పైన నమకం సడలుతుంది
జై సమైఖ్యాంధ్ర జై జై సమైఖ్యాంధ్ర

No comments:

Post a Comment